News March 30, 2025

ఖమ్మం: 488 కేంద్రాలు.. ఆశలన్నీ బోనస్ పైనే!

image

ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో 2.10 లక్షల ఎకరాల్లో వరికి 344, భద్రాద్రి కొత్తగూడెంలో 65వేల ఎకరాలకు గాను 144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్‌లోనూ సన్నాలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, వానాకాలం బోనస్ కొంతమేర పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్

Similar News

News April 2, 2025

MBNR: ఖబర్దార్ రేవంత్ రెడ్డి: డీకే అరుణ

image

‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూములు వేలం వేయడం సరికాదు..ఆ భూములు ఎవరి జాగిరు కాదు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

News April 2, 2025

కర్ణాటకలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్స్‌పై నిషేధం

image

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం(1988)లోని సెక్షన్-93ని అనుసరించి ప్రభుత్వం నిబంధనల్ని ఏర్పాటు చేసేవరకూ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులివ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

News April 2, 2025

RBI డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా

image

దశాబ్దకాలం తర్వాత RBI డిప్యూటీ గవర్నర్‌గా మహిళ నియమితులయ్యారు. ప్రముఖ ఎకానమిస్ట్ పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 20 ఏళ్లపాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం. భారత ప్రభుత్వ అడ్వైజర్‌గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(NCAER) డైరెక్టర్‌గానూ సేవలందించారు. RBI మానిటరీ పాలసీ కమిటీలో పూనమ్ చేరనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!