News February 18, 2025
ఖమ్మం: ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం

ఖమ్మం రీజియన్లో ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,29,743 ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. అత్యధికంగా మే నెలలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.68,46,890 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా రూ.4,84,050 ఆదాయం వచ్చింది.
Similar News
News March 14, 2025
పర పురుషులతో భార్య సెక్స్చాట్ను ఏ భర్తా భరించలేడు: హైకోర్టు

భార్య తన సెక్స్ లైఫ్ గురించి పరపురుషులతో చాటింగ్ చేస్తే ఏ భర్తా భరించలేడని MP హైకోర్టు తెలిపింది. ‘పెళ్లయ్యాక దంపతులు మొబైల్లో తమ మిత్రులతో అనేక అంశాలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఆ సంభాషణలు గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి అపోజిట్ జెండర్తోనైతే జీవిత భాగస్వామి గురించి అస్సలు అభ్యంతరకరంగా ఉండొద్దు’ అని పేర్కొంది. ఆ భార్య సవాల్ చేసిన పిటిషన్ను కొట్టేస్తూ కుటుంబ కోర్టు మంజూరు చేసిన విడాకులను ఆమోదించింది.
News March 14, 2025
జయ కేతనం సభలో ఆకట్టుకున్న ప్రదర్శన

చిత్రాడలో జనసేన జయకేతనం సభ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక జానపద నృత్యం ‘డొల్లు కుణిత’ కళాకారుల ప్రదర్శన విశేషంగా అలరించింది. అంతకుముందు వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
News March 14, 2025
జగిత్యాల: హోలీ వేడుకల్లో కలెక్టర్ దంపతులు

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు అదనపు కలెక్టర్ బి.ఎస్లత తో కలిసి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్ దంపతులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ పిల్లలకి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. నరేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్ పాల్గొన్నారు.