News March 13, 2025
ఖమ్మం: ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంల బదిలీ

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ డిప్యూటీ ఆర్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్ను మహబూబ్నగర్కు, జీ.ఎన్.పవిత్రను షాద్నగర్కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
Similar News
News March 14, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.
News March 14, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో టెండర్లకు ఆహ్వానం

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండేళ్ల కాల పరిమితితో మందులు, శస్త్ర చికిత్స వినియోగ వస్తువులు, ప్రయోగశాల రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాత్-ల్యాబ్ ఇంప్లాంట్ల కోసం టెండర్లు కోరుతున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు మార్చి 20 లోగా టెండర్ ఫారాలు తీసుకొని, దరఖాస్తులను ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.
News March 14, 2025
ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి ఒంటి పూట బడులు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం(రేపటి) నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్స్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు పక్కాగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు.