News March 19, 2025
ఖమ్మం: ఓటు నమోదుకు 4,734 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో ఫారం 6 క్రింద 4,734 దరఖాస్తులు రాగా, 3,267 నూతన ఓటర్లను నమోదు చేశామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో 943 దరఖాస్తులు తిరస్కరించామని, 550 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో 1,459 పోలింగ్ కేంద్రాలకు గాను ఈవీఎం గోడౌన్లో 5,824 బ్యాలెట్ యూనిట్లు, 2,202 కంట్రోల్ యూనిట్లు, 2,218 వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2025
మత్కేపల్లిలో రూ.1.50లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఫారసు మేరకు మత్కేపల్లి గ్రామానికి చెందిన బండి స్వాతి రూ.60,000, పగడాల శీను రూ.40,000, పగడాల బాబురావు రూ. 50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చింతకాని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News March 19, 2025
నేడే బడ్జెట్.. ఖమ్మం ప్రజల గంపెడు ఆశలు..!

నేడు అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పెండింగ్లో ఉన్న ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పాలేరు ఇంజినీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు, సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్, ఖమ్మం మెడికల్ కాలేజ్, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం నుంచే ముగ్గురు మంత్రులు ఉండటంతో నిధులు దండీగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News March 19, 2025
భద్రాద్రి: మైనర్పై అత్యాచారం..యువకుడిపై పోక్సో కేసు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.