News April 19, 2025
ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మంజిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతుంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినవస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం కూడా లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?
Similar News
News April 20, 2025
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ

ఖమ్మం: నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క అన్నారు. శనివారం మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 1317 మంది రైతుల నుండి రూ.24.66 కోట్ల విలువ గల 10628.760 మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించినట్లు అదనపు కలెక్టర్ మంత్రులకు వివరించారు.
News April 20, 2025
21 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి: DEO

ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగే ప్రవేశ పరీక్షల కొరకు విద్యార్థులు ఈ నెల 21 నుంచి http://telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని DEO సోమశేఖరశర్మ తెలిపారు. ఈనెల 27న 6వ తరగతి విద్యార్థులకు ఉ.10 గంటల నుంచి మ.12.00 గంటల వరకు, 7వ, 10వ తరగతి విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
News April 20, 2025
నేటి నుంచి పరీక్షలు.. 8 కేంద్రాలు ఏర్పాటు

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో పదో తరగతి విద్యార్థులు 655మంది, ఇంటర్ అభ్యర్థులు 898మంది ఉన్నారు. నేటి నుంచి 26వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు జరగనున్నాయి.