News June 8, 2024
ఖమ్మం చరిత్రలో భారీ మెజార్టీ
కూసుమంచి: ఖమ్మం ఎంపీ ఎన్నికల చరిత్రలో ఏ ఎంపీకీ రాని మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాయకన్ గూడెంలో స్థానిక నేతలతో నిర్వహించిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అతి త్వరలోనే అర్హులైన అందరికీ ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News October 3, 2024
ఖమ్మం: గాలి వాన బీభత్సం
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేలకొండపల్లి మండలం బైరంపల్లిలో పెద్ద గాలికి చెట్టు విరిగి గేదెపై పడింది. అనాసాగరం- పమ్మి శివారులో భారీ వృక్షం పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
News October 3, 2024
నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి(2025-26) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 7వ తేదీ అన్నారు. 01-05-2013 నుండి 31-07-2015 జన్మించి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 18-01-2025 న ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో వరుసగా 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
News October 2, 2024
రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లను ఈనెల 3 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ (11020/11019), ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (12706/12705) భద్రాచలం రోడ్ ప్యాసింజర్ పునః ప్రారంభం ఎక్స్ప్రెస్ చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.