News February 25, 2025
ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES!

√ ఖమ్మం నగరంలో జాబ్ మేళా √ ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన √ పెనుబల్లి: ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు √ పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష √ వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన √ సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √ మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన √ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన.
Similar News
News February 25, 2025
ఖమ్మం: ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దు: సీపీ

ఖమ్మం కమ్మిషనరేట్ పరిధిలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరకూడదని, రోడ్ల వెంట తిరగరాదని హెచ్చరించారు. మైకుల వినియోగం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News February 25, 2025
ఖమ్మం: మార్కెట్కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం మిర్చి పోటెత్తింది. ఏకంగా 1.20 లక్షల బస్తాల మిర్చి వచ్చింది. బుధవారం నుంచి ఆదివారం వరకు శివరాత్రి సెలవులు ఉండటం.. మంగళవారం ఒక్క రోజే మార్కెట్ ఓపెన్ ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. ఉమ్మడి ఖమ్మం నుంచే కాక నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. క్వింటాకు ధర రూ.14,125 పలికింది.
News February 25, 2025
ఖమ్మం: మిరప ధర పతనం.. రైతుల దిగాలు!

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.