News April 4, 2025
ఖమ్మం జిల్లాలో TODAY ముఖ్యాంశాలు

∆} ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో 6నెలల జైలు శిక్ష.. ∆} ఖమ్మం: సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం: బీజేపీ ∆} HCU భూములపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి ∆} కామేపల్లి: అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్ ∆} ఖమ్మంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర ∆} ఖమ్మం: సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి: తుమ్మల ∆}KMM: తలతాకట్టు పెట్టెనా పథకాలు అమలు చేస్తాం: పొంగులేటి.
Similar News
News April 11, 2025
నియోజకవర్గ మార్పుపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొంగులేటి

రాబోయే ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి కాకుండా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంపై మంత్రి స్పష్టత ఇచ్చారు. పాలేరు ప్రజల ఆశీర్వాదంతోనే తాను మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పేర్కొన్నారు.
News April 11, 2025
14 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు కార్యాచరణ: మంత్రి

KMM: తిరుమలాయపాలెం మండలంలో 14 కోట్లతో గ్రామాల్లో రోడ్డు అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇస్లావత్ తండా, మెడిదేపల్లి, పిండిప్రోలు, తిరుమలయపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అటు రాబోయే 4 సం.లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని పేర్కొన్నారు.
News April 11, 2025
టూ వీలర్ మెకానిక్ల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

ఖమ్మం టూవీలర్ మెకానిక్ల సమస్యలను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్వయంగా అడిగితెలుసుకున్నారు. మెకానిక్ షాపుల వద్దకు వెళ్లిన ఆయన వారితో మాట్లాడారు. వారి యూనియన్ ఆద్వర్యంలో చేస్తున్న అనేక కార్యక్రమాలను అధ్యక్షుడు కోండల్ రావు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా వారి సేవలను కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వం పరంగా మెకానిక్లకు ఎలాంటి స్కీంలు లేవని వారు చెప్పారు.