News March 4, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు సదస్సు ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన

Similar News

News March 4, 2025

ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. 72 కేంద్రాలు ఏర్పాటు

image

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,600మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా 72 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, దానిపై సెంటర్ చిరునామా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. 

News March 4, 2025

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు: సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, సమావేశాలు, ర్యాలీలు, మైకుల వినియోగం నిషేధించామని తెలిపారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.

News March 4, 2025

రఘునాథపాలెం: యువకుడి ఆత్మహత్య.. వ్యక్తి అరెస్టు

image

రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడికి చెందిన జనబాయి వెంకటేష్‌ ఆత్మహత్య కేసులో ఇదే మండలం కోటపాడుకు చెందిన బట్ట నాగేశ్వరావును సోమవారం అరెస్టు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చిమ్మపూడికి చెందిన పాపయ్య కుమారుడు వెంకటేష్‌ను నాగేశ్వరరావు అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆత్మహత్య చేసుకున్నాడు.  పాపయ్య ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశామన్నారు.

error: Content is protected !!