News March 14, 2025

ఖమ్మం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు.!

image

ఖమ్మం జిల్లాలో వేసవి ప్రభావం ఒక్కసారిగా పెరిగింది. గురువారం మధిరలో 40.4°, (ఏఆర్ఎస్)లో 40.3°, గేట్ కారేపల్లి, సిరిపురం, ఎర్రుపాలెంలో 40.1°, వైరా, సత్తుపల్లిలో 40.0° ఉష్ణోగ్రత నమోదైంది. మరో 39 ప్రాంతాల్లో 39-39.9° మధ్య, 9 ప్రాంతాల్లో 38°, 2 కేంద్రాల్లో 37° నమోదైంది. అత్యల్పంగా కూసుమంచిలో 36° నమోదయింది, మార్చి రెండో వారంలోనే భానుడి తీవ్రత పెరగడం గమనార్హం.

Similar News

News March 14, 2025

ఖమ్మం: రుణాలు చెల్లించలేదని జెండాలు పాతారు!

image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పంట రుణాలు చెల్లించలేదని రైతులు పొలాల వద్ద బ్యాంక్ అధికారులు జెండాలు పాతారు. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం, అరేగూడెం గ్రామాల్లో రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించలేదంటూ అధికారులు గురువారం ఎర్రజెండాలు పాతారు. నేలకొండపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దాదాపు 20 మంది రైతులు సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు తీసుకొని స్పందించకపోవడంతో జెండాలు పాతినట్లు చెప్పారు.

News March 14, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.

News March 14, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో టెండర్లకు ఆహ్వానం

image

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండేళ్ల కాల పరిమితితో మందులు, శస్త్ర చికిత్స వినియోగ వస్తువులు, ప్రయోగశాల రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాత్-ల్యాబ్ ఇంప్లాంట్ల కోసం టెండర్లు కోరుతున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు మార్చి 20 లోగా టెండర్ ఫారాలు తీసుకొని, దరఖాస్తులను ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.

error: Content is protected !!