News March 29, 2025

ఖమ్మం జిల్లాలో మండుతున్న ఎండలు

image

ఖమ్మం జిల్లాలో భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. జిల్లాలో శుక్రవారం అత్యధికంగా ఖమ్మం ఖానాపురం పీఎస్, ముదిగొండ(M) పమ్మిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు మధిరలో 41.2, రఘునాథపాలెం, కామేపల్లిలో 41.0, వైరాలో 40.8, కొణిజర్ల, ఖమ్మం(రూ) పల్లెగూడెంలో 40.6, చింతకాని, వేంసూరులో 40.1, సత్తుపల్లి 39.6, తిరుమలాయపాలెం 39.4, కల్లూరులో 38.8 డిగ్రీలు నమోదయ్యాయి.

Similar News

News April 2, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కామేపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
∆} బోనకల్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 2, 2025

ఖమ్మం: సహకార పురోగతి ప్రగ్యా పథకంపై ప్రశ్నించిన ఎంపీ

image

సహకార ప్రగ్యా పథకం పురోగతి వివరాలు తెలపాలని.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ శిక్షణ కేంద్రాల సంఖ్యను పెంచాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. మంగళవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఆ పథకానికి సంబంధించిన వివరాలు చెప్పాలన్నారు. దీనికి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

News April 2, 2025

ఖమ్మం: విద్యార్థుల ముసుగులో BRS అరాచకం: మంత్రి

image

HCU భూ అంశంపై విద్యార్థుల ముసుగులో BRS అరాచకం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. జంతువులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో చూపుతున్న ఫోటోలు పాతవని స్పష్టం చేశారు. అక్కడి బండరాళ్లు, చెరువులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదని మంత్రి పొంగులేటి చెప్పారు.

error: Content is protected !!