News March 10, 2025
ఖమ్మం ప్రయోజనాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల భేటీ

ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆదివారం HYDలో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెంకట్రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఖమ్మం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారని సమాచారం. ఎమ్మెల్యేలు కనకయ్య, రాగమయి, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, ఆదినారాయణ, రాందాస్ నాయక్, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.
Similar News
News March 10, 2025
జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు: అనగాని

AP: జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా విభజన జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు స్థలాలు కేటాయించలేదు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాలపై చూపలేదని ఎద్దేవా చేశారు. అవసరమైన చోట్ల త్వరలో కలెక్టరేట్లు నిర్మిస్తామని తెలిపారు.
News March 10, 2025
‘మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందాం’

వికారాబాద్ జిల్లా తాండూరు పరిధి యాలాల్ మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతుల 9 నెలల బాబు వశిష్ఠ ‘బైలేరియా అట్రే సై’ అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్సకు రూ.22 లక్షలు అవసరమని చెప్పడంతో <<15707873>>దాతల కోసం<<>> తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కాగా మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందామని ఇప్పటికే కాంగ్రెస్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
News March 10, 2025
అయ్యర్లో పెరిగిన కసి.. వరుస ట్రోఫీలతో సత్తా

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన తర్వాత శ్రేయస్ అయ్యర్లో కసి పెరిగింది. కెప్టెన్గా IPL-2024, రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలతో పాటు ఇరానీ కప్ గెలిపించారు. CTలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీకి గాయమవడంతో జట్టులోకి వచ్చిన అయ్యర్ కీలక సభ్యుడిగా మారారు. దీంతో శ్రేయస్కు BCCI మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.