News September 18, 2024

ఖమ్మం: మిర్చి @ రూ.20,000

image

వరుస సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మార్కెట్లో మిర్చి ధర క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News September 20, 2024

మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగింది: మంత్రి పొంగులేటి

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో భారీ అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. భగీరథలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు తేలియాజేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 53 శాతం మంది ప్రజలకు మంచినీరు అందలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికి మంచినీరు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

News September 19, 2024

సాగర్ ఎడమ కాలువ గండ్లను పూడ్చాలి: మంత్రి తుమ్మల

image

సాగర్ ఎడమ కాలువ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తుపాను ప్రభావంతో వరదల వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయని, కాలువ మరమ్మతు పనులు త్వరగా చేపట్టాలని తుమ్మల కోరారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందించడామే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను వేగవంతం చేయాలని తుమ్మల అన్నారు.

News September 19, 2024

వరద బాధితులకు నెల జీతం చెక్ అందించిన కూనంనేని

image

ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం తన నెల జీతాన్ని అందజేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి నెల జీతం చెక్కును అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.