News February 6, 2025

ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈనెల 10నుంచి 20వరకు రద్దు చేస్తున్నట్లు, ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని తెలిపారు.

Similar News

News February 6, 2025

వరుస ప్రశంసలతో దూసుకెళ్తున్న ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తన పనితీరు, వ్యక్తిత్వంతో వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం గురుకు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని సూచనలు ఇచ్చారు. తరువాత రైతు అవతారం ఎత్తి పొలాల బాట పట్టి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఖమ్మం ఎన్నెస్పీ ప్రభుత్వ స్కూల్ సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొన్ని మోటివేషన్ క్లాసులు విన్నారు.

News February 6, 2025

మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి.. పేరు ఇదే..!

image

మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కానీ కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్‌‌ తెలిపారు. ఈనెల 2న కెమెరాకు చిక్కిందన్నారు.

News February 6, 2025

ఖమ్మం: భార్య మర్డర్.. భర్త, అత్తకు జీవిత ఖైదు

image

భార్యను హతమార్చిన కేసులో భర్తకు, ఆమె అత్తకు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెజిస్ట్రేట్ వివరాలిలా.. ముదిగొండ మండలం బాణాపురం తండాకు చెందిన టీ.ఉపేందర్ 2017లో కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం 2020లో హత్య చేశాడు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు కాగా, విచారించిన కోర్టు భర్త ఉపేందర్, అత్త పద్మకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.

error: Content is protected !!