News March 21, 2024
ఖమ్మం: రైల్వే లైన్ కోసం మార్కింగ్

రైల్వే లైన్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్న మార్కింగ్తో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో డోర్నకల్-మిర్యాలగూడెం వరకు రైల్వే లైన్ కోసం అధికారులు ఖమ్మం రూరల్ మండలంలో సర్వేని చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు వ్యక్తం కావడంతో నిలిపివేశారు. మూడు రోజులుగా ఎస్సీపీ నలుపు, తెలుపు రంగులతో మార్కింగ్ను ఎంవి పాలెం, కాచిరాజుగుడెం, ఆరేకొడు, చింతపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేశారు.
Similar News
News April 20, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

:- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ 10వ తరగతి పరీక్షలు:-ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు :-సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన :-వేంసూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన :-ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News April 20, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్ల (బ్యాక్లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News April 20, 2025
ఖమ్మం: ‘సీఎం వస్తేనే పెళ్లి ఖరారు చేసుకుంటా’

CM రేవంత్ రెడ్డిని తన పెళ్లికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్కు యువజన కాంగ్రెస్ నేత భూక్య గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు. కారేపల్లి మండలం మేకలతండాకి చెందిన గణేష్ తనకు పెళ్లి కుదిరిందని సీఎం వచ్చిన రోజే తాను పెళ్లి తేదీ ఖరారు చేస్తానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి సీఎంకు రావాలని రిక్వెస్ట్ లెటర్ పంపారు. ఈ లెటర్ జిల్లాలో హాట్ టాఫిక్గా మారింది.