News March 3, 2025

గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

image

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. SI రవి కుమార్ వివరాలు.. కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

Similar News

News March 3, 2025

రోహిత్‌పై కామెంట్స్.. కేంద్రమంత్రి మండిపాటు

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ <<15636715>>వ్యాఖ్యలను<<>> కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్‌పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్‌పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.

News March 3, 2025

సూర్యాపేట: ఉపకార వేతన కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఉపకార వేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి లత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం కళాశాల విద్యార్థులు, యాజమాన్యాలు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

News March 3, 2025

జనసేనలోకి మాజీ MLA!

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. వారం రోజుల్లో ఆయన JSP తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు AUGలో వైసీపీకి రాజీనామా చేశారు.

error: Content is protected !!