News April 24, 2024

గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు

image

గజపతినగరం అభ్యర్థిగా కురిమి నాయుడు స్థానంలో దోలా శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. అటు బొబ్బిలి అభ్యర్థిగా మరిపి విద్యాసాగర్, నెల్లిమర్ల నుంచి ఎస్.రమేశ్ కుమార్ బరిలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Similar News

News April 21, 2025

విజయనగరం: కేటగిరీల వారీగా పోస్టులు వివరాలు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో డీఎస్సీ ద్వారా 446 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. కేటగిరిలా వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.➤ OC-184 ➤ BC-A:33 ➤ BC-B:43➤ BC-C:3 ➤ BC-D:31 ➤ BC-E:16➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:29➤ SC-గ్రేడ్3:31 ➤ ST:26 ➤ EWS:40 NOTE సజ్జెక్టుల వారీగా వివరాల కోసం ఇక్కడ <<16156073>>కిక్ల్<<>> చేయండి.

News April 21, 2025

రాజాం: జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

image

మండలంలోని ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తరి నాగరాజు రాజాంలోని ఆర్కే కాంప్లెక్స్‌లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డులు ఇస్తున్నారని వెళ్లారు. జనసేన నాయకుడు పొగిరి సురేశ్ బాబు తనను ఇక్కడికెందుకు వచ్చావని కులం పేరుతో తిట్టి, అతని అనుచరులతో దాడి చేయించాడని రాజాం పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రవి కుమార్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2025

VZM: ఈ నెల 22న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల పర్యటన

image

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 22వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3-00 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకొని, 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు చేరుకొని పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్ట్ పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

error: Content is protected !!