News March 24, 2024

గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి VS నర్సారెడ్డి 

image

KCR ఇలాకా గజ్వేల్‌లో BRS నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నేత నర్సారెడ్డి మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటీవల నర్సారెడ్డిపై ప్రతాప్ రెడ్డి ఆరోపణలు చేయగా దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ జగదేవ్‌పూర్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈరోజు మాట్లాడారు. గజ్వేల్‌లో కాంగ్రెస్‌ను ధీటుగా నిలబెట్టిన వ్యక్తి నర్సారెడ్డి అని అన్నారు. వంటేరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతాడంటూ ఎద్దేవా చేశారు.

Similar News

News April 18, 2025

న్యాయవాదుల అభిమానం మరువలేనిది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

image

మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం మరువలేనిదని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి శారద అన్నారు. సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా మెదక్ కోర్టులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలందించడం గొప్పవరం అన్నారు. ప్రతి న్యాయవాది పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు. మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.

News April 18, 2025

మెదక్: ఈ నెల 21న అప్రెంటిషిప్ మేళా

image

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా పథకం ద్వారా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 21న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొననున్నారని అన్నారు. మెదక్ జిల్లాలోని ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 18, 2025

మెదక్: పెళ్లికి అడ్డుగా ఉందని కూతురిని చంపిన తల్లి అరెస్ట్

image

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని పాపను తల్లి నదిలో పారేసిన ఘటన కొల్చారంలో జరిగింది. వివరాలు.. చిలిపిచెడ్(M)కి చెందిన గాయత్రీకి కొల్చారం(M) వాసితో పెళ్లైంది. వీరికి 4 నెలల కూతురు ఉంది. వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో గాయత్రీ కుమార్తెతో అదృశ్యమైంది. గాయత్రీనే రెండో పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని మంజీరాలో పాపను పారేసి హత్య చేసినట్లు తేలింది. గాయత్రీని, తండ్రి దీప్లా, అత్త బూలి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!