News March 22, 2025

గద్వాల: ‘ఎవరైనా వేధిస్తే మాకు చెప్పండి’ 

image

గద్వాల మండలం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ మొగలయ్య హాజరై ప్రసంగించారు. షీటీం సేవల గురించి, వేధింపులకు గురైనప్పుడు షీటీంను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడాలన్నారు.

Similar News

News March 24, 2025

HYD: ఏప్రిల్ 1 నుంచి స్కిల్ ఎడ్యుకేషన్ మేళా

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల సాఫ్ట్వేర్ స్కిల్ కోర్సుల్లో విద్యార్దులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల పాటు స్కిల్ ఎడ్యుకేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మణికొండలోని కార్యాలయంలో స్వయంగా గాని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News March 24, 2025

మెదక్: సైకిల్ పై వెళ్లి బస్టాండ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుంచి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్ పై వెళ్లి ఆదివారం రామయంపేట బస్టాండ్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రామాయంపేట బస్టాండ్‌లో శుభ్రతకు సంబంధించిన ఆర్టీసీ డీఎంకు పలు సూచనలు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను మహాలక్ష్మి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. తనిఖీ చేసిన అనంతరం ఆర్టీసీ బస్సులో మెదక్‌కు చేరుకున్నారు.

News March 24, 2025

SRD: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

image

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు డీఈవో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్‌ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.

error: Content is protected !!