News April 14, 2025

గద్వాల: ‘జార్జిరెడ్డి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి’

image

PDSU వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అకేపోగు రాజు ఆధ్వర్యంలో జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు గంజిపేట రాజు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజు మాట్లాడుతూ.. జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 16, 2025

HYD: మహిళా భద్రత కోసం T-SAFE యాప్

image

మహిళా భద్రత కోసం యువత టెక్నాలజీని వినియోగిస్తున్నారని మహిళా భద్రత విభాగం డీజీ షికా గోయల్ తెలిపారు. T-సేఫ్ ఆండ్రాయిడ్ యాప్‌ను ఇప్పటి వరకు 42,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనివల్ల 36,263 ట్రిప్పులు నమోదు కాగా, 30% పైగా మూడు కమిషనరేట్ల పరిదివే, 65,000కుపైగా ఏజెంట్ కాల్స్ అందినట్లు పేర్కొన్నారు. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, T-SAFE యాప్ మీరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 16, 2025

అమెరికాలో అనారోగ్యంతో మధిర వాసి మృతి

image

మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News April 16, 2025

ALERT: లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

image

TG: LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.

error: Content is protected !!