News March 11, 2025

గద్వాల: తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా పిల్లలు

image

గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలో కొద్దిరోజుల క్రితం భారతి గుండెనొప్పితో మృతిచెందగా ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. గ్రామానికి చెందిన గడ్డమీది రాముడు తనవంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. పేదింటికి చెందిన ఆ పిల్లలను దాతలు ఆదుకోవాలని ఆయన కోరాడు.

Similar News

News December 15, 2025

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: డీఈఓ

image

కంది మండలం ఉత్తరపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. పాఠశాలలో బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థుల చేత పాఠ్యాంశాలను చదివించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు.

News December 15, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

✒PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు:ఎస్పీలు
✒NGKL: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
✒PHASE-3 పూర్తయ్యే వరకు MCC అమల్లోనే: ఎస్పీ
✒100% ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి:కలెక్టర్లు
✒PHASE-3 ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్లు
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒నూతన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యేలు
✒పోలింగ్ సామగ్రి పంపిణీ: కలెక్టర్లు

News December 15, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓తుది విడత ఎన్నికలకు ఏర్పాటు పూర్తి: కలెక్టర్
✓3వ విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
✓బూర్గంపాడు: ట్రాక్టర్ బోల్తా యువకుడు మృతి
✓జూలూరుపాడు గ్రామపంచాయతీకి ఎన్నికలు లేవు
✓ఓటును అమ్ముకోవద్దు అంటూ ఆళ్లపల్లిలో యువకుడి ప్రచారం
✓పుస్తకాల కోసం పీఓ రూ.45 వేల చెక్ అందజేత
✓భద్రాచలం: మహిళ ఆత్మహత్యాయత్నం సెల్ఫీ వీడియో
✓కౌలు రైతులు ఆన్లైన్ చేసుకోవాలి: పినపాక ఏఈఓ
✓రెండవ విడతలో 154 సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక