News March 17, 2025
గద్వాల: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 18, 2025
వనపర్తి: అనధికార లే అవుట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

అనుమతి లేని, అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో ఎల్ఆర్ఎస్ పేమెంట్ల అంశంపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతిలేని, అనధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
News March 18, 2025
ప్రభుత్వ స్థలాలను గుర్తించండి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ సబ్ స్టేషన్లకు 5 నుంచి 10 ఎకరాలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాలను గుర్తించాలని సూచించారు.
News March 18, 2025
ప. గో: ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్

జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్లో డీఆర్డీఏ, వ్యవసాయ, ఇరిగేషన్, డీపీవో, టూరిజం శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడంపై చర్చించారు. గుర్రపు డెక్కతో ఆర్నమెంటల్ వస్తువులను కూడా రూపొందించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.