News March 20, 2025

గద్వాల బార్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

image

గద్వాల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ రావు, ఉపాధ్యక్షుడిగా గుండయ్య, కార్యదర్శిగా షఫీ ఉల్లా, సంయుక్త కార్యదర్శిగా దామోదర్, కోశాధికారిగా విశ్వనాధ్ గౌడ్, గ్రంథాలయం కార్యదర్శిగా మన్యం కొండా, కార్యనిర్వాహక సభ్యులుగా మాధవి లత, వెంకట్ రమణారెడ్డి, శేషిరెడ్డి, మధుసూదన్ బాబును ఎన్నుకున్నారు.

Similar News

News March 28, 2025

వచ్చే నెల 19నుంచి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

image

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 19న అమెరికాకు వెళ్లనున్నారు. బ్రౌన్ యూనివర్సిటీని సందర్శించిన అంతరం బోస్టన్‌లోని భారత సంతతి ప్రజలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో ఆయన డల్లాస్‌, వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. టెక్సాస్ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు.

News March 28, 2025

నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం

image

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో గంజాయి కలకలం రేపింది. అపురూపాలయం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తుండగా స్థానిక విలేకర్లు గ్రామస్థుల సహాయంతో పట్టుకున్నారు. గ్రామంలో విచారించగా వీరు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిసింది. మాక్లూర్ పోలీస్‌‌‌లకు సమాచారం అందించగా నిందితుల నుంచి మూడు ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.

News March 28, 2025

నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్ 

image

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.

error: Content is protected !!