News March 15, 2025
గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అంతర్ రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మానవపాడు మం. చెన్నిపాడుకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి (34) తన తల్లి సుబ్బమ్మతో కలిసి కలుగొట్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అలంపూరు చౌరస్తా నుంచి శాంతినగర్ వెళ్లేదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News March 16, 2025
గ్రూప్-1 ఫలితాల మూల్యాంకనంలో లోపాలు: ప్రసన్న హరికృష్ణ

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడంపై MLC అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని అన్నారు. సబ్జెక్టులపై అవగాహన లేని వారితో వాల్యుయేషన్ చేయించారని, EM బ్లూప్రింట్ను TMలోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడంతో TM వారికి అన్యాయం జరిగిందన్నారు. టాప్-100లో TM, ఉర్దూ మీడియం వారు ఎందరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
News March 16, 2025
BRS తీరును ఖండిస్తూ జిల్లాలో కాంగ్రెస్ నిరసన

BRS నాయకులు దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. RR జిల్లా వ్యాప్తంగా KTR, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి, BRS దళిత వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News March 16, 2025
KMR: పేదరికాన్ని జయించాడు. సర్కార్ నౌకరి సాధించాడు

గాంధారి మండలం నేరాల తాండకు చెందిన బర్దవాల్ మెగరాజ్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పేదరికంలో పుట్టి పెరిగిన మెగరాజ్ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కష్టపడి ప్రభుత్వ అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు దోమకొండలో ప్రభుత్వ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. కాగా మెగరాజ్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే విద్యనభ్యసించాడు.