News April 6, 2025

గద్వాలలో ఉప ఎన్నికలు: KCR

image

గద్వాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయని.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించినట్లు BRS గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసుల హనుమంతు నాయుడు అన్నారు. శనివారం KCR అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు హనుమంతు నాయుడు తెలిపారు. 

Similar News

News April 8, 2025

మోమిన్పేట్: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. మంగళవారం మోమిన్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను మందులను జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 8, 2025

KG రైస్‌కు రూ.43 ఖర్చు.. రూ.10కి అమ్ముకోవడం దారుణం: నాదెండ్ల

image

AP: సన్నబియ్యం విషయంలో తెలంగాణతో పోటీపడబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అందించేది నాణ్యమైన బియ్యమని అందుకుగాను KG రైస్‌కు రూ.43 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ మెుత్తంలో కేంద్రం 61, రాష్ట్రం 39శాతం భరిస్తోందని పేర్కొన్నారు. ఇంత ఖర్చుచేసి పేదలకు బియ్యం అందిస్తుంటే వాటిని రూ.10కి అమ్ముకోవడం దారుణమన్నారు. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.

News April 8, 2025

చింతూరు: ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ

image

ఈ నెల 10న చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పేజ్ 1bలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలన్నారు. నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు వెళ్లిన తర్వాత జీవనోపాధి, నైపుణ్య శిక్షణకు ఎటువంటి అవకాశాలు కావాలో తెలియజేయాలన్నారు.

error: Content is protected !!