News March 20, 2025
గద్వాల్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి

గద్వాల్ జిల్లాలో జిల్లాలో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. బుధవారం అలంపూర్లో గరిష్ఠంగా 40.3, గద్వాల్, సాతర్లలో 40.2, కొలూర్ తిమ్మనదొడ్డిలో 39.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సయమంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 21, 2025
తూ.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

తూ.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా రాజమండ్రిలో 36 డిగ్రీలు, గోపాలపురం 32 డిగ్రీలు, కొవ్వూరు 36 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
కాకినాడ జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా కాకినాడ, పిఠాపురంలో అప్పుడే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

AP: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను ఎస్సీ, ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది. దర్యాప్తు అధికారిని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనను విజయవాడ సీఐడీ కోర్టు మూడు రోజుల సీఐడీ కస్టడీకి ఇస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.