News March 14, 2025

గన్నవరం: వల్లభనేని వంశీని వదలని కేసులు 

image

వల్లభనేని వంశీపై నమోదైన 2 కేసుల్లో గురువారం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో, పోలీసులు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, ఈ కేసుల్లో విచారణ చేపట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కేసుల విచారణ కోసం త్వరలోనే వంశీని కోర్టు ముందుకు హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Similar News

News March 15, 2025

కృష్ణా: నేటి నుంచి ఒంటి పూట బడులు

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7:45నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయని పేర్కొన్నారు. 

News March 14, 2025

బాపులపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

News March 14, 2025

ఘంటసాల: బ్రతుకు తెరువు కోసం వస్తే బ్రతుకులు తెల్లారాయి  

image

పొట్టకూటి కోసం కోటి కష్టాలని.. బ్రతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు. 

error: Content is protected !!