News March 5, 2025

గరుగుబిల్లిలో వ్యక్తి ఆత్మహత్య

image

గరుగుబిల్లి మండలానికి చెందిన నాగల్ల సింహాచలం( 56) ఆత్మహత్య చేసుకున్నట్లు కొమరాడ ఎస్సై నీలకంఠం తెలిపారు. ఎస్ఐ కథనం.. మృతుడు గొర్రెల కాపరి. తన కుమారుని వైవాహిక జీవితం సరిగా లేకపోవడంతో మనస్తాపంతో మంగళవారం కొమరాడ మండలం గుమడ గ్రామ దరి గొర్రెల మంద విషం తాగి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News March 6, 2025

తిరుపతి: దొంగల ముఠా అరెస్ట్

image

ఎవరు లేని ఇళ్లను పగలు నిఘా పెట్టి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వారి నుంచి రూ.35 లక్షల విలువగల 501 గ్రా. బంగారం, 1,20,000 విలువగల 2116 గ్రాముల వెండి నగలు, ఒక కారు, ఒక ఆటో, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరిపై పలు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ చాటిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

News March 6, 2025

ఈనెల 8న మహిళాశక్తి పాలసీ విడుదల

image

TG: ఈనెల 8న జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్‌‌ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని, మజ్జిగప్యాకెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

News March 6, 2025

సంగారెడ్డి: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

error: Content is protected !!