News April 16, 2025
‘గల్ఫ్లో సోన్ మండల యువకుడి హత్య’

సోన్కు చెందిన హస్తం ప్రేమసాగర్ దుబాయ్లో హత్యకు గురయ్యారు. మృతదేహం అక్కడే ఉండిపోయింది. బాధిత కుటుంబానికి MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, నాయకులు జరిగిన ఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
BCCI కాంట్రాక్ట్.. శ్రేయస్ సూపర్ కమ్బ్యాక్

గతేడాది BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్తో తిరిగి రిటైనర్షిప్ దక్కించుకున్నారు. CTలో IND తరఫున అత్యధిక రన్స్ చేయడంతో పాటు KKRకు IPL ట్రోఫీ అందించారు. డొమెస్టిక్ క్రికెట్లోనూ పరుగుల వరద పారించారు. దీంతో BCCI అతడిని B కేటగిరీలో చేర్చింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనలతో గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్పై BCCI కరుణ చూపింది. అతడిని C కేటగిరీలో చేర్చింది.
News April 21, 2025
IPL.. CSKకు ఇంకా అవకాశం ఉందా?

IPLలో మేటి జట్లను చిత్తు చేసిన CSK ఈసారి వరుస పరాజయాలు చవిచూస్తోంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఇప్పటికీ CSK ప్లేఆఫ్స్కి వెళ్లొచ్చు. ప్రస్తుతం 8 మ్యాచుల్లో 2 నెగ్గి 4 పాయింట్లతో ఉన్న ఆ జట్టు.. మిగతా 6 మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధించాలి. నెట్ రన్రేట్ కూడా పెంచుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. మరి CSK ప్లేఆఫ్స్కు వెళ్తుందని మీరు భావిస్తున్నారా?
News April 21, 2025
‘శాలరీ’ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది!

భారత్లో దశాబ్దాలుగా మధ్య తరగతివారికి ఆర్థికంగా అండగా నిలిచిన శాలరీ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ ముఖర్జియా అభిప్రాయపడ్డారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ‘ఇండియా నూతన ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తోంది. జీతం కోసం కాకుండా ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు రానున్నాయి. చదువు ఒక్కటే సరిపోదు. వందలాది మంది చేసే పనిని AI క్షణాల్లో చేసేస్తోంది. ఎవరికీ గ్యారంటీ లేదు’ అని వివరించారు.