News March 27, 2024

గాజువాక: నేలబావిలో సెక్యూరిటీ గార్డు మృతదేహం

image

గాజువాక ఆటోనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ ఎస్ బ్లాక్‌లో టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గణేష్ (31) నేలబావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 8, 2025

కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్‌పూర్‌లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 8, 2025

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు

image

రాజస్థాన్‌లో జరుగుతున్న 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ నుంచి 33 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 5 స్వర్ణ, 7రజత, 10 కాంస్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. వీరికి శుక్రవారం పలువురు అభినందనలు తెలిపారు. విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.

News February 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలని అధికారుల‌ను విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు. నామినేష‌న్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వ‌సతుల క‌ల్ప‌న‌, జాబితాల త‌యారీ, సిబ్బంది కేటాయింపు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌న్నారు.

error: Content is protected !!