News April 6, 2024

గిద్దలూరులో వాడి వేడిగా మారిన రాజకీయాలు

image

గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. వైసీపీ నుంచి కుందూరు నాగార్జునరెడ్డి, టీడీపీ నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా జనసేన రెబల్ అభ్యర్థిగా ఆమంచి స్వాములు బరిలో నిలుస్తున్నట్లు శుక్రవారం కంభంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమంచి వెల్లడించారు. దీంతో గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ చర్చ వాడివేడిగా మారింది. దీంతో గిద్దలూరులో ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.

Similar News

News October 6, 2024

పొదిలి: ఉప సర్పంచ్‌పై రాడ్లతో దాడి

image

ఉప సర్పంచ్‌పై రాళ్ల దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొదిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఓంకార్‌ని శనివారం అర్ధరాత్రి సమయంలో, తన ఇంటికి వెళ్ళే క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కాపుకాసి రాడ్లుతో తలమీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News October 5, 2024

ఒంగోలులో ఈనెల 8న మినీ జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధి సంస్థ, సీడప్ ఒంగోలువారి ఆధ్వర్యంలో అక్టోబరు 8న, ఒంగోలు ప్రభుత్వ బాలికల ITI కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.ITI, డిడిప్లొమా, టెన్త్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సం. నుంచి 30సం. లోపు మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని జిల్లా అధికారులు రవితేజ, భరద్వాజ్‌లు తెలియజేశారు.

News October 5, 2024

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.