News February 1, 2025
గుంటూరు: 63.4% మేర జరిగిన పింఛన్ల పంపిణీ
గుంటూరు జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 63.4% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,53,464 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,60,700 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసినట్లు అధికారిక డాష్బోర్డు ద్వారా తెలుస్తోంది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీకి రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.
Similar News
News February 1, 2025
కేక్ కొనేందుకు వెళుతూ ముగ్గురు స్పాట్ డెడ్
గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కొర్నేపాడు గ్రామానికి చెందిన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు స్నేహితులు ఒకే బైక్పై కేక్ కొనుగోలు చేసేందుకు వెళుతూ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని మరణించారు. ఈ ప్రమాదంతో ముగ్గురు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక పోలీసులు తెలిపారు.
News February 1, 2025
రోడ్డు ప్రమాదంలో వట్టిచేరుకూరు మండల వాసులు మృతి
గుంటూరు నగర శివారు ఏటుకూరు-ప్రత్తిపాడు రోడ్డు నల్లపాడు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు వట్టిచేరుకూరు మండలం కుర్నూతల, బయ్యారం గ్రామస్థులుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 1, 2025
‘పది’ విద్యార్థుల అల్పాహారానికి నిధులు విడుదల: డీఈవో
జడ్పీ స్కూల్స్ ‘పది’ విద్యార్థులకు 30 రోజుల పాటు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ 07.50చొప్పున మొత్తం రూ.20,40,750 లను గుంటూరు జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి మంజూరు చేశారని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఆ నిధులు జమ చేశారన్నారు. ప్రతీ రోజు అరటిపండ్లు, బిస్కెట్లు, కోడిగుడ్లు, గుగిళ్ళు విద్యార్థులకు ఇవ్వాలన్నారు.