News March 11, 2025

గుంటూరు: జీబీఎస్ కలకలం.. 3కు చేరిన మృతులు

image

గుంటూరులో జీబీఎస్ మరణాల సంఖ్య మూడుకు చేరింది. పల్నాడు జిల్లా మాదలకు చెందిన సీతామహాలక్ష్మి (50) ఈనెల 5న జీజీహెచ్ లో చేరారు. కాగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News December 23, 2025

అమరావతి బ్రాండ్‌కు ఊపిరి.. ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం

image

అమరావతి బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో AP ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా పర్యాటక శాఖ సరికొత్త సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ఆవకాయ’ అనే వినూత్న పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా వేడుకలు నిర్వహించనుంది.

News December 23, 2025

నేడు తుళ్లూరులో రైతు JAC సమావేశం

image

తుళ్లూరులోని బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి మేరకు రైతు JAC సభ్యులు మంగళవారం సమావేశం కానున్నారు. భారత మాజీ ప్రధాని వాజపేయి శత జయంతి సందర్భంగా ఆయన కాంశ్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ ఈ నెల 25న చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి, తదితరులు పాల్గొని కార్యక్రమంపై చర్చించనున్నారు.

News December 23, 2025

GNT: పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన రద్దు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన అనూహ్యంగా రద్దైంది. నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఆయన పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయినట్లు స్థానిక జనసేన నేతలు వెల్లడించారు. గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళకు మళ్లీ వస్తానని పవన్ మాటిచ్చారు. ఆయన రాక కోసం ఎదురుచూసిన గ్రామస్థులు, పర్యటన రద్దవడంతో నిరాశ చెందారు.