News March 27, 2024
గుంటూరు: నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇన్ఛార్జ్ల నియామకం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711473997795-normal-WIFI.webp)
గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇన్ఛార్జ్లను వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ను నియమించింది. సత్తెనపల్లి, చిలకలూరిపేట, వేమూరులకు మోదుగుల వేణుగోపాల్ను.. రేపల్లెకు ఎలక్షన్ అబ్జర్వర్గా గాదె మధుసూదన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.
Similar News
News February 7, 2025
గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738918574348_71687173-normal-WIFI.webp)
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరారు.
News February 7, 2025
ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738901531889_19210675-normal-WIFI.webp)
ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు.
News February 7, 2025
గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738883414867_60415181-normal-WIFI.webp)
కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.