News May 30, 2024
గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 94 నంబర్ గల గుంటూరు వెస్ట్ అసెంబ్లీ లో మొత్తం 282 పోలింగ్ బూత్లలో ఓటింగ్ జరిగింది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో 21 రౌండ్లలో లెక్కించనున్నారు. రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది.
Similar News
News April 24, 2025
గుంటూరు రాజకీయాల్లో ఈ ఎన్నిక కీలకం

జీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెల 28న జరగనుంది. మేయర్ పదవి కోసం మొత్తం 63 మంది సభ్యుల్లో సగానికి పైగా ఓట్లు అవసరం. గతంలో టీడీపీ మేయర్గా ఉన్న కోవెలమూడి రవీంద్రకు మళ్లీ అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ ఎన్నికలో 56 కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ ఓటు వేయనున్నారు. నామినేషన్ల గడువు 24 కాగా, 28న పోలింగ్ జరుగుతుంది. గుంటూరు రాజకీయాల్లో ఈ ఎన్నిక కీలకం కానుంది.
News April 23, 2025
పదో తరగతి పరీక్షల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్

తెనాలి(M) సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారు. సర్కార్ బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో అద్భుతంగా రాణించిన గుంటూరు

గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.