News April 16, 2025

గుంటూరులో ఇంటర్ విద్యార్థి అదృశ్యం 

image

గుంటూరులోని బొంగరాలాబీడుకు చెందిన కల్పన(19) ఓ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎంసెట్ కోచింగ్ నిమిత్తం అమరావతి రోడ్డు కాలేజీ వద్దకి వెళ్లి అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లింది. ఇంత వరకూ తిరిగి ఇంటికి రాలేదని, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదని తల్లి భారతి అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Similar News

News April 19, 2025

GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News April 18, 2025

గుంటూరు: పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు

image

గుంటూరులో ఓ యూట్యూబర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన యువతికి మార్చి 10న నల్లచెరువు 2వ లైనుకు చెందిన కైలాశ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18న పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, చేసుకోను అంటూ వెనక్కి తగ్గాడు. మధ్యలో పెద్దలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బాధిత యువతి లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 18, 2025

గుంటూరు: స్పోర్ట్స్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఎంఎస్‌సీ స్పోర్ట్స్ కోచింగ్, పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు డిఎస్ఈవో పి.నరసింహారెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రవేశాల ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు మే 2వ తేదీలోపు ‘ssc.nsnis.in’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!