News February 4, 2025

గుండుమాల్‌: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

image

గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారిస్తున్నట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుత జాడను కనుక్కోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Similar News

News March 14, 2025

రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.

News March 14, 2025

ఆరోగ్య శ్రీ.. ఐదేళ్ల పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’

image

TG: ఆరోగ్య శ్రీ కింద ఇకపై ఐదేళ్ల వయసు పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ చేయనున్నట్లు ట్రస్ట్ CEO కర్ణన్ సర్క్యులర్ జారీ చేశారు. గతంలో 3yrs వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. పిల్లల్లో వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ సర్జరీ చేస్తారు. దీని వల్ల వినికిడి సమస్య పూర్తిగా తొలగిపోనప్పటికీ కొంత ఉపశమనం ఉంటుంది. ప్రైవేటులో ఈ సర్జరీకి రూ.6-12లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.

News March 14, 2025

బిక్కనూర్: రేపటి నుంచి సిద్ధిరామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు

image

బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని ఉన్న దక్షిణ కాశీగా, పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 

error: Content is protected !!