News March 3, 2025
గుడిహత్నూర్లో బాలిక సూసైడ్

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News December 19, 2025
రాజమండ్రి: పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి- DMHO

ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DMHO డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఒక విడత పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందుకు 2,31,250 డోసుల పోలియో వ్యాక్సిన్ సిద్ధం చేశామన్నారు.
News December 19, 2025
నిజామాబాద్: నకిలీ నోట్లు ఎక్కడివి.. నిఘా వర్గాలు

నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. వర్ని కెనరా బ్యాంక్లో జలాల్ పూర్కు చెందిన రైతు చిన్న సాయిలు క్రాప్ లోన్ చెల్లించాడు. మొత్తం 417 నోట్లు రూ.2,08,500 పూర్తిగా నకిలీవిగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ని ఎస్ఐ రాజు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
News December 19, 2025
మత్స్యకారులు సీఎం చంద్రబాబును కలిసే ఛాన్స్?

అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఈనెల 20 శనివారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాజయ్యపేట మత్స్యకారులు సీఎంను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ రెండు నెలలకు పైగా ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిస్తానని హోంమంత్రి అనిత చెప్పడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. ఈనెల 16న సీఎంతో భేటీ రద్దు కావడంతో, తాళ్లపాలెంలో సీఎం అపాయింట్మెంట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.


