News October 16, 2024
గుర్లలో కోరలు చాచిన డయేరియా
విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో డయేరియా కోరలు చాచింది. రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు మ్యత్యవాత పడ్డారు. బుధవారానికి డయేరియా కేసులు మరిన్ని పెరిగాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో161 మందికి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా ప్రబలిందని బాధితులు చెబుతున్నారు. నెల్లిమర్ల సీహెచ్సీ, విజయనగరం పెద్ద ఆసుపత్రి, గోషాలో డయేరియా రోగులు చికిత్స పొందుతున్నారు.
Similar News
News October 16, 2024
VZM: డయేరియా మరణాలపై సీఎం ఆరా
గుర్లలో డయేరియాతో ఐదుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న చికిత్స, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
News October 16, 2024
VZM: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ
ఢిల్లీలో జరిగిన మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జామినేషన్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాండ్స్ 2024-25 సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ పలు సూచనలు, సలహాలు అందజేశారు.
News October 16, 2024
అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో పైడిరాజుకు కాంస్య పతకం
సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కనకల పైడిరాజు ఈనెల 10 నుంచి 19 వరకు మలేషియాలో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల రన్నింగ్లో కాంస్య పతకం సాధించినట్లు ఆమె గురువు పొట్నూరు శ్రీరాములు తెలిపారు. 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్న పైడిరాజు భారతదేశానికి 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.