News March 20, 2025

గేట్ ఫలితాల్లో యువతి సత్తా 

image

శ్రీకాకుళం క్యాంపస్ (ఎచ్చెర్ల) త్రిబుల్ ఐటీ చదువుతున్న విద్యార్థినీ గేట్-2025లో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులు కొమరాల శ్వేత శ్రీ, 241, అప్పన్న శ్రీనివాస్ 663 ర్యాంక్‌లు వచ్చాయని డైరక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. విద్యార్థినిని బాలాజీ గురువారం అభినందించారు.

Similar News

News March 21, 2025

నందిగాం: జీడి చెట్టుకి ఉరేసుకుని వ్యక్తి మృతి

image

నందిగామ మండలం హరిదాసు పురం గ్రామానికి చెందిన అక్కురాడ డిల్లేశ్వరరావు శుక్రవారం జీడి తోటలో ఉరేసుకుని చనిపోయాడు . జీడి పిక్కలు కోయడానికి వెళ్లిన తన తమ్ముడు చూసి, పోలీసులకు సమాచారం తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2025

గార: నదిలో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృత దేహం

image

గార మండలం కళింగపట్నం సమీపంలో వంశధార నదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2025

ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

image

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. 

error: Content is protected !!