News June 15, 2024
గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో జేబు దొంగల చేతివాటం
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకి పట్టణానికి తొలిసారి రావటంతో పాతబస్టాండ్ సెంటర్లో రద్దీ ఏర్పడింది. ఇందులో జేబుదొంగలు చేతివాటం చూపించారు. సుమారు 10 మంది వద్ద నుంచి రూ.15 లక్షల వరకు కాజేసినట్లు ఆరోపించారు. అయితే స్థానికులు ఓ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను దర్శికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.
Similar News
News October 2, 2024
ఒంగోలు: రైలు కిందపడి వివాహిత సూసైడ్
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలులో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక కేశవస్వామిపేటకు చెందిన దంపతులు శ్రుతి- ప్రసాద్ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రుతి భర్తకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే SI అరుణకుమారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదైంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
News October 2, 2024
ప్రకాశం వస్తున్నారా.. అయితే ఇవి చూసేయండి.!
దసరా సెలవుల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వస్తున్నారా.. అయితే ఈ పర్యాటక ప్రదేశాలను మిస్ కావద్దు. జిల్లాలో భైరవకోన, కొత్తపట్నం, రామాయపట్నం, పాకల బీచ్లు, వల్లూరమ్మ తల్లి ఆలయం, కంభం చెరువు, మాలకొండ స్వామి ఆలయం, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇలా ఎన్నో ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. దసరా సెలవులు అనగానే మీకు గుర్తొచ్చే చిన్ననాటి జ్ఞాపకాలు కామెంట్ చేయండి.
News October 2, 2024
ప్రకాశం జిల్లాలో దసరాకు 136 ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు
దసరా సందర్భంగా ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యార్థం 136 సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి బి సుధాకరరావు తెలిపారు. ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాలకు అన్ని డిపోల నుంచి 136 ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రానుపోను ఒకేసారి టికెట్ రిజర్వు చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.