News July 28, 2024
గొప్పలు కాదు.. దాడులు అరికట్టండి: వైసీపీ

నెల్లూరు జిల్లాలో అత్యాచార ఘటనపై వైసీపీ మండిపడింది. ‘కావలిలో 9 సంవత్సరాల బాలికపై మహబూబ్ బాషా అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను గాలికొదిలేశారు. మీకు మీరు డబ్బా కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు. రాష్ట్రంలో పసిపిల్లలు, మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టండి’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News March 8, 2025
నెల్లూరు: ఘోరం.. బాధల్లో ఉన్నా దోచేశాడు

సమాజం సిగ్గుతో తలిదించుకునే ఘటన ఇది. రాపూరు(మ) తెగచెర్లకు చెందిన ఇద్దరు జీవనోపాధి కోసం మలేషియా వెళ్లి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు. బాధితుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఓ దుండగుడు CMO నుంచి వచ్చానని కలెక్టర్తో అన్ని విషయాలు మాట్లాడానని వారిని నమ్మించాడు. మీ పిల్లలను ఇండియాకు రప్పించేందుకు ఖర్చు అవుతుందని వారి నుంచి రూ.50వేలు దోచేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 8, 2025
బీదను మరోసారి అదృష్టం వరించేనా

టీడీపీలో కీలకనేతగా కొనసాగుతున్న బీద రవిచంద్ర ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్సీపై అధినేత నుంచి హామీ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీద అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. రవిచంద్ర గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎమ్మెల్సీగా వ్యవహరించారు.
News March 8, 2025
చికెన్ టేస్ట్ చేసిన నెల్లూరు కలెక్టర్

నెల్లూరు వీఆర్సీ మైదానంలో చికెన్ & ఎగ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ చికెన్ మేళాను కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చికెన్ను నిర్భయంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకండి అని ప్రజలకు సూచించారు. అలాగే జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చికెన్ టేస్ట్ చేశారు.