News June 9, 2024

గ్రూప్-1 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. పరీక్షా నిర్వహణకు 386 మంది ఇన్విజిలేటర్లు, 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 77 మంది బయోమెట్రిక్ ఆఫీసర్లు తదితరులను నియమించామన్నారు.

Similar News

News October 3, 2024

జగిత్యాల: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హఠాత్మరణం

image

గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల LFL ప్రధానోపాధ్యాయుడు కోగుల రవిబాబు బుధవారం సాయంత్రం ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయన మృతి పట్ల మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

News October 3, 2024

KNR: గడ్డి మందు తాగి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

image

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై తోట తిరుపతి వివరాల ప్రకారం.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి(27) ఉద్యోగం వచ్చినప్పటికీ పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా హుజురాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. మృతుడి తండ్రి సంపత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 3, 2024

సభ్యత్వ నమోదుపై కేంద్ర మంత్రి బండి రివ్యూ సమావేశం

image

కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డితో కలిసి సమావేశమై చర్చించారు. అధిక బీజేపీ సభ్యత్వ నమోదులపై దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.