News March 13, 2025

గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

image

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.

Similar News

News March 13, 2025

కథలాపూర్: స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రయ్య (70) ఉదయం టీ తాగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రివర్స్‌లో వెళ్తూ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ఎర్రయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మృతి చెందారన్నారు.

News March 13, 2025

లోకేశ్వర్ రెడ్డిపై దాడి టీడీపీ నేతల పనే: YCP

image

కోవెలకుంట్ల మం. కంపమల్లలో YCP <<15743280>>నేత<<>> లోకేశ్వర్ రెడ్డిపై TDP నేతలే హత్యాయత్నం చేశారని YCP ఆరోపించింది. ‘పొలంలో ఉన్న లోకేశ్వర్ రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. అతని ఇంటిపైనా దాడికి పాల్పడటంతో లోకేశ్వర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి గాయాలయ్యాయి. ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యాలు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

News March 13, 2025

వైకుంఠపురం డీపీఆర్ రూపొందిస్తున్నాం: మంత్రి

image

AP: వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 15లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండేదని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని అసహనం వ్యక్తం చేశారు.

error: Content is protected !!