News February 13, 2025

చండ్రుగొండ : కేజీబీవీలో బాలికలపై ఎలుకల దాడి

image

చండ్రుగొండలోని కేజీబీవీ బాలికల వసతి గృహంలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. ఎంఈవో సత్యనారాయణ వివరాల ప్రకారం.. పడుకొని ఉన్న  ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి స్వల్పంగా గాయపరిచాయని చెప్పారు. వసతి గృహాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News February 13, 2025

వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు?

image

AP: వల్లభనేని వంశీపై మరో 2 కేసులు నమోదు కానున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో వంశీ నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు నమోదైన కేసులో ఆయన పాత్ర లేదని అప్పట్లో పోలీసులు తేల్చారు. ఆ కేసును రీ ఓపెన్ చేయాలని MLA యార్లగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో YSRCP హయాంలో రూ.210 కోట్ల మేర మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ కేసుల్లో వంశీని పోలీసులు దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది.

News February 13, 2025

IPL: ఆ ఇద్దరు ఎవరో?

image

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, KKR జట్లకు కెప్టెన్లు ఖరారు కావాల్సి ఉంది. ఢిల్లీకి అక్షర్ పటేల్, రాహుల్ తదితర ప్లేయర్ల పేర్లు పరిశీలనలో ఉండగా కోల్‌కతాకు రసెల్, రహానే, నరైన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి మేనేజ్మెంట్స్ ఎవరివైపు మొగ్గుతాయో త్వరలో తేలనుంది.
ఇతర జట్ల కెప్టెన్లు:
CSK-రుతురాజ్, గుజరాత్-గిల్, లక్నో-పంత్, పంజాబ్-శ్రేయస్, రాజస్థాన్-శాంసన్, MI-హార్దిక్, ఆర్సీబీ-రజత్ పాటిదార్, SRH-కమిన్స్.

News February 13, 2025

RECORD: 82 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు

image

సాధారణంగా ఒక్క ఆవు మహా అంటే 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటుంది. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ ఆవు ఏకంగా 82 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి జాతీయ రికార్డు సృష్టించింది. లూథియానాలోని 18వ అంతర్జాతీయ PDFA డైరీ & అగ్రి ఎక్స్‌పోలో హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి ఆశ్చర్యపరిచింది. ఇది పంజాబ్ పశువుల పెంపకం, వాటి పాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

error: Content is protected !!