News March 22, 2025
చర్లపల్లి జైలులో ఖైదీలకు అవగాహన

ఖైదీలకు న్యాయసహాయంపై శనివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ బాల భాస్కరరావు, సెక్రటరీ జస్టిస్ కిరణ్కుమార్లు హాజరై ఖైదీలకు న్యాయసహాయం అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కావాలంటే న్యాయసేవాధికార సంస్ధను సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 25, 2025
MLC Elections: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే..!

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (ఏప్రిల్ 23) 116 మంది (కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు) తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 13 ఉన్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు 54 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 59 ఓట్ల కంటే ఎక్కువ వస్తే వారే విజయం సాధిస్తారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారు.
News March 25, 2025
మేడ్చల్: బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
BRS సభ వేదిక ఘట్కేసర్కి మార్పు!

BRS రజతోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ వేదికను మార్పు చేస్తున్నట్లు సమాచారం. వేసవి తీవ్రత సందర్భంగా పార్కింగ్ సదుపాయాలు అన్ని జిల్లాల నుంచి రవాణా సదుపాయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, తాజా సభ కోసం HYD శివారు ఘట్కేసర్ వద్ద ప్రముఖ ప్రైవేట్ స్కూల్ వెనక ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు సమాచారం, ఉంది. ఉంది…!