News February 28, 2025

చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు.  పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

Similar News

News February 28, 2025

ఎక్స్‌పో 2025లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

image

మహిళా వ్యవస్థాపక స్ఫూర్తిని పురస్కరించుకుని ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(WISE&B2B) ఎక్స్‌పో 2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వృద్ధికి దారితీసే సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి తెలంగాణ కట్టుబడి ఉందన్నారు.

News February 28, 2025

NZB: ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మార్చ్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణ కోసం శుక్రవారం నగరంలోని ఖిల్లా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపర్రింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

News February 28, 2025

మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు

image

AP: రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనిపై వారికి అవగాహన పెంచాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పనితీరు బాగుండాలి. మళ్లీ సభకు రావాలనే భావనతో పని చేయాలి. విభేదాలు, గ్రూపులను సహించను. ఎంపీలతో కలిసి సమన్వయం చేసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

error: Content is protected !!