News March 22, 2024

చిత్తూరు: ఆ 4 చోట్ల మహిళలు గెలవలేదు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.

Similar News

News April 20, 2025

చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 20, 2025

DSC: చిత్తూరు జిల్లాలో 1,473 పోస్టుల భర్తీ

image

డీఎస్సీ-2025 ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,473 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:38
➤ హిందీ:17 ➤ ఇంగ్లిష్: 104
➤ గణితం: 30 ➤ఫిజిక్స్: 29
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 130
➤ పీఈటీ: 86 ➤ఎస్జీటీ: 976
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్టీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

News April 20, 2025

పలమనేరు PGRSకు రానున్న కలెక్టర్

image

పలమనేరులో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొంటారని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. పలమనేరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఉదయం 9:30 గం. ప్రారంభవుతుందని, స్వయంగా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

error: Content is protected !!