News April 15, 2024

చిత్తూరు: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంబళ్లపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది. ఎస్సై శివ కుమార్ కథనం.. కురబలకోట మండలం, గొడ్డిన్లవారిపల్లికి చెందిన మంజునాథ్ తన భార్య సుజాతతో గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది, తంబళ్లపల్లి మండలం, కుక్కరాజుపల్లి సమీపంలోని కుమ్మరపల్లి వద్ద ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News December 16, 2025

చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

image

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.

News December 16, 2025

AMCల ద్వారా రూ.80 లక్షల ఆదాయం

image

జిల్లా మార్కెటింగ్ శాఖకు AMC ల ద్వారా నవంబరులో రూ.80.03లక్షల ఆదాయం వచ్చినట్లు AD పరమేశ్వరన్ తెలిపారు. పలమనేరు AMC లో రూ.50.58 లక్షలు, చిత్తూరుకు రూ.11.37 లక్షలు, పుంగనూరుకు రూ.7.34 లక్షలు, బంగారుపాళ్యంకు రూ.2.35 లక్షలు, నగరికి రూ.2.16 లక్షలు, కుప్పంకు రూ.4.13 లక్షలు, పెనుమూరుకు రూ.74 వేలు, రొంపిచె ర్లకు రూ.69వేలు, SR పురం రూ.36వేలు, అత్యల్పంగా సోమల AMC ద్వారా రూ.31వేలు వచ్చినట్లు PD తెలిపారు.

News December 16, 2025

పూతలపట్టు: హైవేపై ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన బస్సు

image

పూతలపట్టు మండలం కిచ్చన్న గారి పల్లి సమీపంలో ఆరు లైన్ల జాతీయ రహదారిపై లారీని బస్సు ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం రాత్రి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రయివేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు