News March 24, 2024
చిత్తూరు : కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన
చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన నిర్వహించారు. వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్సై షేక్షావల్లి, టూ టౌన్ సిఐ ఉలసయ్య , ఎస్సై ప్రసాద్ పోలీసు సిబ్బంది నగరంలోని పలు ప్రధాన క్రీడలలో కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో గొడవలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News September 14, 2024
SVU : పీజీ ఫలితాలు విడుదల
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏడాది ఏప్రిల్ నెలలో పీజీ ( PG) LLM మొదటి సెమిస్టర్, జులైలో M.A, M.COM, M.SC నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News September 14, 2024
చిత్తూరు: రాళ్లు పడి గాయపడ్డ వారిలో ఒకరు మృతి
ఎన్ హెచ్ పనులవద్ద టిప్పర్ పై నుంచి రాళ్లు పడి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిలో ఒకరు మృతిచెందారు. బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి కథనం.. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు శనివారం ములకలచెరువు, మదనపల్లె ఎన్ హెచ్ పనులు తుమ్మనగుట్టలో చేస్తున్నట్లు చెప్పారు. పని జరిగేచోట టిప్పర్లోని రాళ్లు వారిమీదపడి గాయపడగా, మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. వారిలోబీహారుకు చెందిన అతుల్ కుమార్ సింగ్ మృతి చెందాడన్నారు.
News September 14, 2024
నాపై విష ప్రచారం చేసిన మీడియా సంస్థకు నోటీసులు: పెద్దిరెడ్డి
తనపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు పంపినట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఓ న్యూస్ ఛానల్కు పరువునష్టం కింద రూ.50 కోట్లకు న్యాయవాదులు నోటీసులు పంపారని తెలిపారు. నిరాధారంగా వార్తలు రాసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయ పరంగా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.